బుల్లితెర పై ప్రసారమవుతున్న 'ఢీ' షోకి రేటింగ్స్ ఇప్పుడు దారుణంగా పడిపోయాయి. 'ఢీ' డాన్స్ షోకి ఒకప్పుడు మంచి ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. రష్మీ, సుధీర్ హోస్ట్ గా చేసినంత కాలం కూడా ఈ డాన్స్ షో కి మంచి రేటింగ్స్ వచ్చేవి. శేఖర్ మాస్టర్ జడ్జిగా వ్యవహరించినప్పుడు మంచి ఎనెర్జీతో, జోష్ తో ముందుకు సాగేది. ఇప్పుడు వాళ్ళెవరూ ఈ షోలో లేకపోయేసరికి హద్దులు దాటిన ముద్దులతో, చెత్త పంచ్ డైలాగ్స్ తో షో మొత్తం గందరగోళంగా మారింది. డాన్స్ తక్కువ, సొల్లు ఎక్కువ అంటూ ఆడియన్స్ కూడా ఈ షోని తిడుతున్నారు. దీంతో ఈ షోకి రేటింగ్స్ బాగా తగ్గిపోయాయి. ఇక ఇప్పుడు ఢీ షోకి గట్టి పోటీ ఇచ్చేందుకు 'ఆహా' సిద్ధమయ్యిందనే విషయం తెలిసిందే. 'డాన్స్ ఐకాన్' పేరుతో ఆహా రంగంలోకి దిగింది.
'తెలుగు ఇండియన్ ఐడల్' షో తర్వాత ఈ న్యూ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు అల్లు అరవింద్, ఓంకార్. ఈ షోలో పాల్గొనే వాళ్ళ కోసం రిజిస్ట్రేషన్స్ ప్రక్రియ కూడా స్టార్ట్ చేసింది. ఈ షోకి ఫేమస్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ జడ్జి గా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శేఖర్ మాస్టర్ తో పాటు ఇంకొంత మంది జడ్జెస్ కూడా ఈ షో కి రావడానికి రెడీగా ఉన్నట్లు సమాచారం. ఈ ఇయర్ ఎండింగ్ వరకు బాలయ్య 'అన్స్టాపబుల్' షోతో పాటు డాన్స్ షో కూడా నిర్వహించేందుకు ఆహా టీం ప్రయత్నాలు స్టార్ట్ చేసేసింది.
ఢీ డాన్స్ షోకి రేటింగ్ పడిపోవడం ఒక ఎత్తు ఐతే దీనికి పోటీ ఇచ్చే మరో షో లేకపోయేసరికి ఈ విషయాన్ని కాష్ చేసుకోవడానికి అల్టిమేట్ గా ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ అందించేందుకు న్యూ టాలెంట్ కి వేదిక కల్పించేందుకు అన్ని రకాలుగా ఆహా సిద్దమయ్యింది. ఇక ఆ షో మొదలైతే మాత్రం ఢీ డాన్స్ షో పరిస్థితి ఏమిటో తెలీదు. ఉంటుందా, దుకాణం సర్దేస్తుందా అనేది చూడాలి.